News August 24, 2025
GHMC ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని మట్టి గణపతి విగ్రహాల పంపిణీ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ఏడాది 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ విగ్రహాలు ఆగస్టు 25, 26 తేదీలలో జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. పర్యావరణ హితమైన గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని ప్రజలకి సూచించారు.
Similar News
News August 24, 2025
మూసీ పరివాహకంలో వ్యక్తి మృతదేహం లభ్యం!

అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వివరాలు తెలిస్తే అంబర్పేట్ పోలీస్ స్టేషన్ SHO నంబర్ 8712660590కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
News August 24, 2025
బీసీ రిజర్వేషన్లు.. గాంధీభవన్ కీలక నిర్ణయం ?

రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు చెప్పకనే చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News August 24, 2025
HYD: గణపతి సేవలో 25 వేల మంది కార్మికులు

వినాయక చవితి అంటేనే పూజలు.. వ్రతాలు..నిమజ్జన కార్యక్రమాలుంటాయి. వీధులు, చెరువుల వద్ద పూజా వస్తువులు, పూలు, ప్రసాదాలు పడేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ 25 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. వీరంతా మూడు షిఫ్టుల్లో విధినిర్వహణలో పాల్గొంటారు. ముఖ్యంగా 29 నుంచి నిమజ్జన వేడుకలు జరుగనుండటంతో చెరువుల వద్ద క్లీనింగ్ కార్యక్రమాలు చేపడతారు.