News July 29, 2024

GHMC పరిధిలో 521 క్రీడ మైదానాలు

image

GHMC ఆధ్వర్యంలో మొత్తం 521 క్రీడా మైదానాలు,29 స్పోర్ట్స్ కాంప్లెక్సులు,13 ఈత కొలనులు, 5 టెన్నిస్ కోర్టులు, 11 స్కేటింగ్ రింక్స్, 135 వ్యాయామశాలలు పని చేస్తున్నాయి.ఆయా వ్యాయామశాలల్లోని పరికరాలన్నీ తుప్పు పట్టి ఉన్నాయి.కొత్త పరికరాలను కొనుగోలు చేస్తున్నట్టు లెక్కలు చెబుతుంటే..వ్యాయామశాలల్లో మాత్రం అలాంటి వస్తువులేవి కనిపించచడం లేదు.GHMC కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ పట్టాలని ప్రజల కోరారు.

Similar News

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

News September 24, 2024

విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: RSP

image

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను BRS నేత RSP ‘X’ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ప్రభుత్వo DSC పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్‌లైన్(CBT)లో నిర్వహించింది. అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎగ్జామ్ నిర్వహించింది. ఇంకా రిజల్ట్స్ విడుదలచేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు. ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.

News September 24, 2024

HYD: కేంద్రమంత్రిని కలిసిన స్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్యే

image

కేంద్రమంత్రి నితీన్‌గడ్కరీని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారులపై గడ్కరీతో స్పీకర్ చర్చలు జరిపారు. స్పీకర్‌తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులు ఉన్నారు.