News August 3, 2024
GHMC: 225 బస్తీ దవాఖానల్లో ఉచిత పరీక్షలు

ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులను కట్టడి చేయగలమని HYD నగరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగూ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నగరంలోని 225 బస్తీ దవాఖానాల్లో జ్వరాలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. నీరసం, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు బస్తీ దవాఖానల్లో చూపించుకోవాలని సూచించారు.
Similar News
News October 31, 2025
HYD: ఉక్కు మనిషి వల్లే ఊపిరి పీల్చాం!

భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. 565 సంస్థానాలను ఒకే త్రివర్ణ పతాకం కింద సమీకరించిన మహనీయుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో చెరిగిపోదు. ఆపరేషన్ పోలో ద్వారా నిజాంపాలనకు తెరదించారు. ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం వల్లే ఊపిరి పీల్చామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు?
News October 31, 2025
HYD: ఉక్కుమనిషి ‘సర్దార్’ ఎలా అయ్యారో తెలుసా?

1928లో గుజరాత్లోని బర్దోలి తాలూకాలో బ్రిటిష్ ప్రభుత్వం భూమిశిస్తు 30% పెంచగా రైతులు ఆగ్రహించారు. ఎన్నో విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. పటేల్ స్ఫూర్తితో వారంతా సత్యాగ్రహానికి దిగారు. 137 గ్రామాల రైతులు ఐక్యంగా పోరాడారు. ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు తగ్గించక తప్పలేదు. రైతుల ఐక్యతకు శిఖరంగా నిలిచిన ఈ పోరాటం పటేల్ను ‘సర్దార్’ చేసింది. ఆయన చొరవతోనే HYD భారత్లో విలీనం అయింది.
News October 31, 2025
HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

రాజ్ భవన్లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.


