News March 24, 2025

GHMC: రూ.2.95 కోట్లతో వాటర్ డ్రెయిన్, VDCC రోడ్లు..!

image

చాంద్రాయణగుట్ట బండ్లగూడలో గల ప్రోగ్రెస్ స్కూల్ నుంచి క్రిస్టల్ టౌన్, డెలివరీ కొరియర్ సర్వీస్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మించనున్నామని GHMC తెలిపింది. అంతేకాక వీడీసీసీ రోడ్ నిర్మాణాలకు రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం తెలిపినట్లుగా GHMC తాజాగా నేడు పేర్కొంది.

Similar News

News March 29, 2025

ఎంపురాన్‌లో ఆ సీన్స్ కట్ చేస్తున్నాం: నిర్మాత

image

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమాపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని నిర్మాత గోకులం గోపాల్ స్పందించారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు పృథ్వీరాజ్‌కు సూచించినట్లు తెలిపారు. ఎంపురాన్ సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు ఓవరాల్‌గా కథను ఒక వర్గాన్ని కించపరిచేలా తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 29, 2025

అవనిగడ్డ: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు 

image

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో లక్షలాది రూపాయలున్నట్లు గుర్తించారు. బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు. 

News March 29, 2025

మండుతున్న ఎండలు.. 150 మండలాల్లో 40+ డిగ్రీలు

image

AP: రాష్ట్రంలో వడగాలులు, ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇవాళ 150కిపైగా మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు IMD వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కొమరోలు, నంద్యాల, కమలాపురంలో 42.5, రుద్రవరం, అనకాపల్లిలో 42, కోసిగి, తాడిమర్రిలో 41 డిగ్రీలు రికార్డయినట్లు పేర్కొంది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించింది.

error: Content is protected !!