News February 8, 2025
GHMC వాటర్ బోర్డ్ వెబ్సైట్ మొరాయింపు
HYD మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్బోర్డు వెబ్సైట్ మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్ బుకింగ్కు ఇబ్బందులు తలెత్తాయి. బిల్లుల చెల్లింపులూ జరగలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం వాటర్బోర్డు వెబ్సైట్ సర్వర్ హ్యాక్ అయ్యిందని సాంకేతిక సమస్యలు తలెత్తగా, తాజాగా వాటర్బోర్డు సర్వర్ మొరాయించడంతో వెబ్సైట్ పని చేయలేదు.
Similar News
News February 8, 2025
అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు
అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 8, 2025
HYD: ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్రావు
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘం అన్నారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని విమర్శించారు.
News February 8, 2025
ఆమన్గల్కు 13న కేటీఆర్
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నెల 13న పదిహేను వేల మందితో రైతు దీక్ష ఉండనుంది. ఈ దీక్ష మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో జరగనుంది. ఈ కార్యక్రమనికి మాజీమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. రైతు మహాదీక్షకి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.