News October 3, 2024
ఘోరం: ఐదుగురు బిడ్డలున్నా అన్నం పెట్టట్లేదు

TG: కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు కాదు పొమ్మన్నారు. దీంతో పోలీసులు వారి కడుపు నింపుతున్నారు. మహబూబ్నగర్(D) మాసన్పల్లికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఓ కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. బిడ్డలు పట్టించుకోకపోవడంతో HYD రాజేంద్రనగర్లో ఓ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. వారిని వృద్ధాశ్రమంలో చేరుస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News February 21, 2026
రిమ్స్ ఎస్ఎన్సీయూ విభాగానికి జాతీయ పురస్కారం

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని శిశు సంరక్షణ కేంద్రం జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. పుదుచ్చేరిలోని జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్షాప్లో ‘ఇన్ఫెక్షన్ కంట్రోల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్’ ప్రాజెక్టుకు గానూ రిమ్స్ బృందం ప్రథమ బహుమతితో పాటు రూ. 5 వేల రివార్డు సాధించింది. ఈ ఘనత సాధించిన బృందాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందించారు. రిమ్స్ వైద్యుల కృషి జిల్లాకు గర్వకారణమని ఆయన కొనియాడారు.
News February 21, 2026
ఆప్కోతో టీటీడీ ఒప్పందం.. భారీ ఆర్డర్

AP: ఆప్కో చరిత్రలోనే తొలిసారి TTD నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3K కండువాలు, 5K దుశ్శాలువాలు, 90K కాటన్ అప్పర్లు, 75K కాటన్ బ్లౌజ్లు సరఫరా చేయాలని TTD కోరింది. వాటిపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. ఈ ఆర్డర్ నేతన్నలకు వేంకన్న దీవెన వంటిదని మంత్రి సవిత పేర్కొన్నారు. వారికి 365 రోజుల పాటు ఉపాధి అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు పనిచేస్తున్నామన్నారు.
News February 21, 2026
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో 349 అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF-108, CRPF-106, ITBP-12, SSB-53, CISF-70 ఉద్యోగాలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జులై 19న రాత పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: https://upsconline.nic.in


