News February 26, 2025
సంతాన ప్రాప్తి కలిగించే జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వరం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలో ఉండే<<15583713>> ఘృష్ణేశ్వర<<>> ఆలయం చివరిది. స్థల పురాణం ప్రకారం శివుడి భక్తురాలి కుమారుణ్ని ఒక మహిళ కొలనులో విసిరేస్తుంది. దీంతో బాలుడు చనిపోతాడు. అంత బాధలోనూ ఆ మాత శంకరున్ని యధావిధిగా పూజిస్తుంది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కుమారునికి ప్రాణం పోస్తాడు. అనంతరం భక్తురాలి కోరిక మేరకు అక్కడే వెలుస్తాడు. ఈ క్షేత్రాన్నిదర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
Similar News
News February 26, 2025
రికార్డు సృష్టించిన ‘లక్కీ భాస్కర్’

స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన 13 వారాల నుంచి ఈ చిత్రం ట్రెండ్ అయి రికార్డు సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. వరుసగా ఇన్ని వారాలు ట్రెండ్ అయిన తొలి సౌత్ఇండియా మూవీ ‘లక్కీ భాస్కర్’ అని ఓ పోస్టర్ విడుదల చేశారు. మీరూ ఈ సినిమా చూశారా?
News February 26, 2025
స్విగ్గీ మెనూలో బీఫ్ ఐటమ్స్.. యూజర్లు ఫైర్

స్విగ్గీ ప్లాట్ఫామ్లో బీఫ్ ఐటమ్స్ను లిస్ట్ చేయడంపై పలువురు యూజర్లు మండిపడుతున్నారు. HYDలోని ఓ రెస్టారెంట్ మెనూలో బీఫ్ ఐటమ్స్ను స్విగ్గీ చూపించింది. దీని గురించి ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘స్విగ్గీని అన్ ఇన్స్టాల్ చేస్తాం. బీఫ్ బిర్యానీ అమ్మడం లీగలేనా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని GHMC తెలిపింది.
News February 26, 2025
నేను BRSలోనే ఉన్నా: గద్వాల్ ఎమ్మెల్యే

TG: తాను BRSలోనే ఉన్నానని గద్వాల్ MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్లో ఉన్నట్లు కొందరు ఫ్లెక్సీలు వేసి అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో చేరి మళ్లీ బీఆర్ఎస్ గూటికి వచ్చిన విషయం తెలిసిందే.