News July 30, 2024

లంకతో మూడో టీ20కి గిల్ దూరం?

image

శ్రీలంకతో ఇవాళ జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌‌కూ టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ కండరాలు పట్టేయడంతో ఆయన ఈ మ్యాచ్‌ ఆడరని సమాచారం. ఇదే కారణంతో రెండో టీ20 మ్యాచ్‌లో గిల్ ఆడలేదు. దీంతో ఆయన స్థానాన్ని సంజూ శాంసన్ భర్తీ చేశారు. మరోవైపు వరుసగా విఫలమవుతున్న మహ్మద్ సిరాజ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులో ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 10, 2026

SBIలో 1146 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>SBI<<>>లో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. పోస్టును బట్టి వయసు 20 నుంచి 42ఏళ్లు కలిగి, డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L చెల్లిస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in

News January 10, 2026

ఇరాన్‌లో 200మంది మృతి! ట్రంప్ మరో వార్నింగ్

image

ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో 200మంది వరకు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని ఓ వైద్యుడు చెప్పడం కలకలం రేపుతోంది. ఈ సంఖ్య కేవలం టెహ్రాన్‌లోనే అని, దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య మరింత ఉండొచ్చన్నారు. ఈ తరహా వార్తలపై ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘పౌరులను చంపుతూ ఉంటే US చూస్తూ ఊరుకోదు. ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.

News January 10, 2026

జంగా కృష్ణమూర్తికి CM చంద్రబాబు ఫోన్!

image

AP: పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి నిన్న TTD బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో CM CBN ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. దీంతో జంగా ఇవాళ లేదా రేపు CMను కలవనున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. కాగా తిరుమలలో అతిథి గృహం నిర్మించడానికి తనకు స్థలం కేటాయింపు పునరుద్ధరణపై ఓ పత్రికలో కథనాలు వచ్చాయని జంగా పేర్కొన్నారు. దీనిపై మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.