News August 10, 2024

బెల్లం ర‌మ్ వ‌చ్చేస్తోంది గురూ..

image

బెల్లంతో తయారు చేసిన మొట్టమొదటి దేశీయ ఒరిజిన‌ల్‌ రమ్ త్వరలో కర్ణాటక మార్కెట్‌లోకి విడుద‌ల‌కానుంది. హులి (టైగర్) పేరుతో ఆగ‌స్టు 15న‌ రానున్న ఈ మైసూర్ స్పెష‌ల్ బ్రాండ్ ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇంట్లోని ముఖ్య‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగించి త‌యారు చేసిన బెల్లం ర‌మ్‌ను ప్రీమియం ర‌మ్‌గా అభివృద్ధి చేశారు. 750ml బాటిల్ బేస్ ధర రూ.630 కాగా, పన్నులు కలుపుకొని రూ.2,800కి లభించనుంది.

Similar News

News November 28, 2025

APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ncpor.res.in/

News November 28, 2025

‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

image

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్. DEC 19 నుంచి ‘హైదరాబాద్‌ బుక్ ఫెయిర్’ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 38వ బుక్ ఫెయిర్ లోగోను ఆయన ఆవిష్కరించారు. NTR స్టేడియంలో DEC 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ఫెయిర్ జరగనుంది. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మీరూ బుక్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ సారి ఏ పుస్తకం కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News November 28, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* రోడ్ల మరమ్మతుల కోసం రూ.276 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
* ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ నిర్వహణలో లోపాలను పరిష్కరించడానికి CS విజయానంద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.
* IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై గతంలో CID నమోదుచేసిన అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
* వర్షాలకు ధాన్యం తడిచి రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారనే కంప్లైంట్‌లు వస్తే JCలదే బాధ్యత: CS విజయానంద్