News April 3, 2024
IPL కాదు GIPL

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్లతో ఫ్యాన్స్కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.
Similar News
News February 15, 2026
శివరాత్రికి జాగరణ ఎందుకు చేస్తారు?

శివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించవచ్చు. నిద్రను జయించి, రాత్రంతా శివనామ స్మరణ, భజనలు చేయడం వల్ల మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సినిమాలు లేదా కబుర్లతో కాకుండా, ధ్యానంతో గడిపే జాగరణ మాత్రమే శివతత్వాన్ని మనలో జాగృతం చేసి, మోక్ష మార్గానికి దారితీస్తుంది.
News February 15, 2026
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్లో ఇంటర్న్షిప్

<
News February 15, 2026
రైతులకు ద్రోహం చేస్తారా?.. కేంద్రానికి రాహుల్ ప్రశ్నలు

USతో ట్రేడ్ డీల్తో కేంద్రం రైతులకు ద్రోహం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘GM సోయా ఆయిల్, DDG (Distillers Dried Grains) US నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్లు మళ్లీ ధరల షాక్ నుంచి బయటపడగలరా? ఈ డీల్లో ఏటా మరిన్ని పంటలు చేర్చుతారా? ఇది తాత్కాలిక ట్రేడ్ ఒప్పందం కాదు.. మన వ్యవసాయ వ్యవస్థపై మరో దేశానికి నియంత్రణ కల్పించడమే. దీనిపై క్లారిటీ ఇవ్వండి’ అని Xలో డిమాండ్ చేశారు.


