News April 3, 2024
IPL కాదు GIPL

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్లతో ఫ్యాన్స్కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.
Similar News
News February 13, 2026
ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్

TG: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్కు విజయాన్ని కట్టబెట్టారని ప్రజలకు CM రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పుతో సంపూర్ణ ఆమోదం తెలిపారని ట్వీట్ చేశారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలను గొప్పగా అభివృద్ధి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు.
News February 13, 2026
వైట్ కాలర్ జాబ్స్ను AI భర్తీ చేస్తుంది: మైక్రోసాఫ్ట్ AI చీఫ్

రాబోయే 12 నుంచి 18 నెలల్లో కంప్యూటర్ ఆధారిత ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందని మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, మార్కెటింగ్, లీగల్, డేటా ఎంట్రీ వంటి పనులు ఆటోమేషన్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల పని వేగం, ఉత్పాదకత పెరిగినప్పటికీ ఉపాధి రంగంలో పెను మార్పులు వస్తాయని ఆయన విశ్లేషించారు. టెకీలు తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
News February 13, 2026
డయాబెటిస్తో మతిమరుపు రిస్క్.. ఎలాగంటే?

టైప్-2 డయాబెటిస్తో బాధపడేవాళ్లలో మతిమరుపు రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటి ప్రకారం.. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్రెయిన్ గ్లూకోజ్ను వాడుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా న్యూరోలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది. నిరంతర హైబీపీ వల్ల ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాస్కులర్ డ్యామేజ్ జరిగి బ్రెయిన్ టిష్యూ దెబ్బతింటుంది. దీంతో దీర్ఘకాలంలో అల్జీమర్స్ రిస్క్ పెరుగుతుంది.


