News April 3, 2024
IPL కాదు GIPL

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్లతో ఫ్యాన్స్కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.
Similar News
News January 17, 2026
DRDOలో JRF, RA పోస్టులు

<
News January 17, 2026
సౌదీ అరేబియాలో అరుదైన చిరుతల మమ్మీలు

నార్తర్న్ సౌదీ అరేబియాలోని గుహల్లో అరుదైన చిరుతల అవశేషాల(మమ్మీలు)ను అధికారులు గుర్తించారు. 130 నుంచి 1800ఏళ్ల మధ్య కాలం నాటివి అని రీసెర్చర్లు చెప్పారు. అరార్ సిటీకి సమీపంలో 54 చిరుతల ఎముకలతోపాటు ఏడు చీతా మమ్మీలను కనుగొన్నారు. క్లౌడీ కళ్లు, శరీర అవయవాలు ఎండిపోయినట్టు ఆ చిరుతల మృతదేహాలు ఉన్నాయి. ఎడారులు, హిమానీనదాలు, చిత్తడి నేలల్లో మమ్మిఫికేషన్ నేచురల్గా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News January 17, 2026
పాలమూరుకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు సాధించలేదు: CM రేవంత్

TG: పదేళ్ల BRS ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని MBNR జిల్లా పర్యటన సందర్భంగా CM రేవంత్ విమర్శించారు. ‘దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అందులో పాలమూరు బిడ్డల శ్రమ ఉంది. కానీ ఈ జిల్లాకు KCR ఒక్క ప్రాజెక్టు సాధించలేదు. పాలమూరు-RR పేరిట రూ.23వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినా ఎత్తిపోతలు పూర్తి చేయలేదు. ఉదండాపూర్ భూనిర్వాసితులకు నిధులు చెల్లించలేదు’ అని ఆరోపించారు.


