News April 3, 2024
IPL కాదు GIPL

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్లతో ఫ్యాన్స్కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.
Similar News
News February 12, 2026
ఇండియన్స్ను టార్చర్ చేస్తూ వీడియో కాల్స్.. ఎలా బయటపడ్డారంటే?

USకు వెళ్లే క్రమంలో గుజరాత్కు చెందిన ధ్రువ్(22), దీపిక(32) నరకాన్ని చూశారు. ఏజెంట్ వీరి నుంచి ₹50L తీసుకుని <<15379310>>‘డంకీ రూట్’<<>>లో US చేరుస్తానన్నారు. అయితే వారు అజర్బైజాన్లో కిడ్నాప్కు గురయ్యారు. దుండగులు వారిని టార్చర్ చేసి, అవయవాలు అమ్మేస్తామని ఫ్యామిలీకి వీడియో కాల్స్ చేయడంతో ₹65Lను పంపారు. మళ్లీ బెదిరించడంతో విదేశాంగ మంత్రి జైశంకర్ను ఆశ్రయించగా, ఆయన దౌత్యపరమైన ఒత్తిడితో వారిని విడిపించారు.
News February 12, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 18పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా(EE), ITI, టెన్త్, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్&రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: hindustancopper.com/
News February 12, 2026
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్సిగ్నల్!

ఎయిర్ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా భారత్ రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్కు రాజ్నాథ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇండియాకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ సత్తా చాటిన విషయం తెలిసిందే.


