News April 3, 2024
IPL కాదు GIPL

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ మ్యాచ్లతో ఫ్యాన్స్కు కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో ‘గ్రేట్ ఇండియన్స్ ప్రీమియర్ లీగ్’ అంటూ దేశంలోని ప్రముఖుల పేర్లతో క్రియేట్ చేసిన టీమ్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అహింస టైటాన్స్, నెహ్రూ రాయల్స్, మిసైల్ సూపర్ కింగ్స్, భారత్ వారియర్స్ వంటి జట్లకు గాంధీ, నెహ్రూ, వాజ్పేయి, కలామ్ వంటివారు కెప్టెన్లుగా పలు AI ఫొటోలను సృష్టించారు.
Similar News
News February 3, 2026
మైతేయి-కుకీ హింస.. CM రిజైన్.. మణిపుర్లో ఏం జరిగింది?

మణిపుర్లో 2023 మేలో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన హింస రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు 250 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాన్ని కంట్రోల్ చేయలేక, సొంత పార్టీ నేతల విమర్శల మధ్య 2025 Feb 9న అప్పటి CM బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో 2025 ఫిబ్రవరి 13 నుంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఏడాది తర్వాత నేడు BJP <<19041653>>కొత్త సీఎం<<>>ను ఎన్నుకుంది.
News February 3, 2026
మజ్లిస్ పార్టీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కన్నుమూత!

AIMIM జనరల్ సెక్రటరీ, మాజీ MLA సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన HYDలోని ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 4సార్లు MLAగా (చార్మినార్-3, యాకుత్పుర-1) పనిచేసిన ఖాద్రీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి అత్యంత ఆప్తుడిగా పేరొందారు. ఆయన మృతి పట్ల అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
News February 3, 2026
ఇది ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ: రాహుల్ గాంధీ

ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశ భద్రత ముఖ్యమైన అంశమని, దీనిపై సభలో మాట్లాడనివ్వకుండా హక్కులను కాలరాశారని విమర్శించారు. ఓ ప్రతిపక్ష నేతకు ఇలా జరగడం పార్లమెంటు చరిత్రలో తొలిసారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంపై ఒక మాయని మచ్చ అని లేఖలో పేర్కొన్నారు.


