News September 23, 2024
బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం
TG: మహబూబ్నగర్(D) దేవరకద్ర(మ)లో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న బయటకు వచ్చిన బాలికను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టి అనంతరం వదిలిపెట్టాడు. ఇంటికొచ్చిన బాలిక కూలి పనులకు వెళ్లొచ్చిన తల్లికి విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 23, 2024
అదే జరిగితే పోటీ చేయను: ట్రంప్
ఈ ఎలక్షన్స్లో గెలవకుంటే 2028లో మళ్లీ పోటీ చేయనని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొవిడ్ టైమ్లో తన పాలన బాగుందన్నారు. సాధారణంగా ఓటమిని అంగీకరించని ఆయన ఇలా మాట్లాడటం ఇంట్రెస్టింగ్గా మారింది. 2020లో మాదిరిగా భారీ స్థాయిలో మోసగిస్తే, తప్పుడు ఆరోపణలు చేస్తేనే అలా జరుగుతుందని ట్రంప్ చెప్పే సంగతి తెలిసిందే. 2028 నాటికి ఆయనకు 82ఏళ్లు వస్తాయి.
News September 23, 2024
‘దేవర’ ఈవెంట్ను అందుకే రద్దు చేశాం: శ్రేయాస్ మీడియా
‘దేవర’ ఈవెంట్ రద్దుపై శ్రేయాస్ మీడియా ప్రెస్నోట్ రిలీజ్ చేసింది. ‘పోలీసులు 4వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చారు. కానీ 30-35 వేల మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్యాన్స్ సేఫ్టీ కోసమే ఈవెంట్ రద్దు చేశాం. మమ్మల్ని క్షమించండి. అవుట్ డోర్ ఈవెంట్ కోసం ప్రయత్నించాం. కానీ గణేశ్ నిమజ్జనం, వెదర్ అలర్ట్స్ వల్ల సాధ్యం కాలేదు. పరిమితికి మించి పాసులు జారీ చేశామన్న ఆరోపణలు అవాస్తవం’ అని పేర్కొంది.
News September 23, 2024
రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు: హరీశ్ రావు
TG: కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యిందని మంత్రులు చెప్పారు. మరి వైరా దిగువన ఉన్న రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? రుణమాఫీ చేస్తానని భద్రాద్రి రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు. వరద బాధితులకు ఇప్పటివరకు పూర్తి పరిహారం ఇవ్వలేదు’ అని ప్రెస్మీట్లో మండిపడ్డారు.