News March 17, 2024
గుడ్డు కూర చేయనందుకు ప్రియురాలి హత్య!

గుడ్డు కూర చేయలేదని ప్రియురాలిని ఓ వ్యక్తి హత్య చేసిన దారుణమిది. లలన్ యాదవ్, అంజలి జంట గురుగ్రామ్లో సహజీవనం చేస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో ఇంటికొచ్చిన లలన్, అంజలిని గుడ్డు కూర చేయమన్నాడు. ఆమె పట్టించుకోలేదు. మద్యం మత్తులో ఉన్న లలన్ బెల్టు, సుత్తితో ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు. ఆ హింసకు అంజలి చనిపోయింది. లలన్ను వెంటనే అరెస్టు చేశామని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News November 13, 2025
ECGC లిమిటెడ్లో 30 పోస్టులు

<
News November 13, 2025
సీఎం, పీఎంను తొలగించే బిల్లు.. జేపీసీలో మన ఎంపీలకూ చోటు

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై కేంద్రం <<18272673>>ఏర్పాటు<<>> చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం లభించింది. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డికి చోటు దక్కింది. కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించాయి.
News November 13, 2025
కేసీఆర్పై జనవరి 19 వరకు చర్యలొద్దు: HC

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా KCRపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. వచ్చే ఏడాది JAN 19 వరకు ఆయనతోపాటు హరీశ్ రావు, ఎస్కే జోషి, స్మితా సభర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదికి 4 వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను JAN 19కి వాయిదా వేసింది.


