News February 4, 2025
అమ్మాయిలూ.. జాగ్రత్త!

సోషల్ మీడియాలో పరిచయమవుతున్న అపరిచితులు స్నేహం పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని TSRTC సజ్జనార్ పేర్కొన్నారు. తెలియని వాళ్లతో చనువుగా ఉండి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. ‘అజ్ఞాత వ్యక్తులతో స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే మీకే నష్టం. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లని ఫాలో అవ్వడం, వారితో చాట్ చేయకండి’ అని యువతకు సందేశం ఇచ్చారు.
Similar News
News December 5, 2025
ఉప్పును నేరుగా చేతితో తీసుకోకూడదు.. ఎందుకు?

ఉప్పును నేరుగా చేతితో తీసుకోవడాన్ని అశుభంగా భావిస్తారు. ఇలా చేయడాన్ని రహస్యాలు పంచుకోవడంలా భావిస్తారు. ఫలితంగా గొడవలు జరుగుతాయని, చేతితో ఉప్పు తీసుకున్నవారిపై శని ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. జ్యేష్టాదేవి దోషాలను తొలగించడానికి ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఇతరుల చేతి నుంచి ఉప్పు స్వీకరిస్తే, వారిలోని చెడు ప్రభావం మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తారు.
News December 5, 2025
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్<<>>ను రద్దు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే రిలీజ్నూ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News December 5, 2025
అరటిలో పిలకల తొలగింపుతో అధిక దిగుబడి

అరటి పంట నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను 20-25 రోజులకొకసారి కోసి వేయాలి. ఇలా చేయడం వల్ల తల్లి చెట్లు బలంగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహ తవ్వితీస్తే తిరిగి ఎదగదు. ఒకవేళ అరటిలో 2వ పంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమైన పిలకను ఎన్నుకొని మిగతా వాటిని తీసివేయాలి.


