News June 24, 2024
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి

TG: ఇంటర్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. 2,54,498 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా 63.86% ఉత్తీర్ణత నమోదైంది. 70.26% బాలికలు, 58.39% బాలురు పాసయ్యారు. 1,38,477 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగా 43.77% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 47.54%, బాలురు 41.37% మంది పాస్ అయ్యారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040 24655027కు కాల్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
Similar News
News December 3, 2025
కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

కోకాపేట్ నియోపోలిస్ భూముల వేలం ముగిసింది. నగరానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎకరాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎకరానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ కనిపిస్తుండటంతో ఇక్కడి కమ్యూనిటీని డెవలప్ చేసే అవకాశం ఉంటుందని, అందుకే ఈ నాలుగు ఎకరాలను ఆన్లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.
News December 3, 2025
భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
News December 3, 2025
త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.


