News August 8, 2024

GIS: హైదరాబాద్‌లో డ్రోన్ సర్వే: కమిషనర్ ఆమ్రపాలి

image

పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణ మెరుగుపరచడమే GIS సర్వే ప్రధాన లక్ష్యమని కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(GIS) గురించి వివరించారు. గ్రేటర్‌ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి రికార్డు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, చిన్న పెద్ద రోడ్లు, చెరువులు, సరస్సులు అన్నింటిని, సిటీ మొత్తం మ్యాపింగ్ జరుగుతుందన్నారు. 

Similar News

News October 16, 2025

జూబ్లీబైపోల్: 3 రోజుల్లో 35 నామినేషన్లు.. 21 వరకు మరెన్నో?

image

జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు 3రోజుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో 35 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇంకా 21 వరకు టైమ్ ఉంది. అంటే ఈ రోజుతో కలిపి ఆరు రోజులన్నమాట. అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విషయమేంటంటే ప్రధాన పార్టీల్లో BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంతవరకు నామినేషన్ వేయలేదు. ఒక్క BRS తప్ప. ఎంతమంది పోటీకి సిద్ధమవుతారో చూడాలి మరి.

News October 16, 2025

రంజీ DAY-2: పడ్డా.. తిరిగి నిలబడ్డ ఢిల్లీ

image

సొంతగడ్డపై జరుగుతున్న రంజీలో HYD, ఢిల్లీని ఆపలేకపోతోంది. ఓపెనర్ సాంగ్వాన్ 117*, ఆయూష్ దొసేజా 158* సెంచరీలతో అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 256/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ బ్యాటర్లు HYD బైలర్లను ఈజీగా ఎదుర్కొంటున్నారు. 2వ రోజు భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసేలా కనిపిస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత వికట్లు పడగొట్టి HYD నిలువరించగలదేమో చూడాలి. మిలింద్ 2, పున్నయ్ ఒక వికెట్ తీశారు.

News October 16, 2025

మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

image

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షి నటరాజన్‌తో భేటీ కీలకం కానుంది.