News June 19, 2024

భక్తులకు నాణ్యమైన మజ్జిగ ఇవ్వండి: TTD ఈవో

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధునాతన యంత్రాలతో పాటు క్వాలిటీని మెరుగుపరిచేందుకు ఫుడ్ కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు. భక్తులకు నాణ్యమైన మజ్జిగను పంపిణీ చేయాలని ఆదేశించారు. పాంచజన్యం కిచెన్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.

Similar News

News December 13, 2025

కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>నేషనల్ <<>>హెల్త్ మిషన్ కాకినాడ జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో 35 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, PG, PGDCA, బీఫార్మసీ, డీఫార్మసీ, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 15- 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, STలకు రూ.200. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News December 13, 2025

టెన్త్ అర్హతతో 714 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-27 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం ₹18,000-₹56,900 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

News December 13, 2025

బత్తాయిలో ఆకుముడత, మంగునల్లి కట్టడికి జాగ్రత్తలు

image

☛ బత్తాయిలో ఆకుముడత పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ బత్తాయిలో మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3ml లేదా ప్రాపర్ జైట్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.