News August 2, 2024
దుర్గగుడికి రూ.100 కోట్లు ఇవ్వండి: ఎంపీ చిన్ని

AP: విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ను TDP MP కేశినేని చిన్ని కోరారు. తిరుమల తర్వాత APలో అతిపెద్ద ఆలయంగా దుర్గగుడి ప్రసిద్ధి పొందిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోజుకు 25వేల మంది, శుక్ర, శని, ఆదివారాల్లో 50వేల మంది దుర్గమ్మ దర్శనానికి తరలివస్తుంటారని వివరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 10, 2025
బుమ్రా 100వ వికెట్పై SMలో చర్చ!

SAపై తొలి T20లో బ్రెవిస్ వికెట్ తీసిన బుమ్రా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వికెట్పై SMలో చర్చ నడుస్తోంది. బుమ్రా నో బాల్ వేశారని, థర్డ్ అంపైర్ కూడా సరైన నిర్ణయం ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నిర్ణయం బౌలర్కు అనుకూలంగా ఉంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అది గుడ్ బాలా? నో బాలా? COMMENT.
News December 10, 2025
డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
– అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
News December 10, 2025
3రోజుల పాటు AP ఛాంబర్స్ బిజినెస్ EXPO

యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. VJAలో ఈ నెల 12,13,14 తేదీల్లో జరిగే EXPOలో మంత్రులు పాల్గొంటారన్నారు. MSME, టూరిజం, టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మహిళ సాధికారతపై సెమినార్లు ఉంటాయని చెప్పారు. 160స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎంట్రీ ఉచితమన్నారు.


