News August 2, 2024

దుర్గగుడికి రూ.100 కోట్లు ఇవ్వండి: ఎంపీ చిన్ని

image

AP: విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ను TDP MP కేశినేని చిన్ని కోరారు. తిరుమల తర్వాత APలో అతిపెద్ద ఆలయంగా దుర్గగుడి ప్రసిద్ధి పొందిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోజుకు 25వేల మంది, శుక్ర, శని, ఆదివారాల్లో 50వేల మంది దుర్గమ్మ దర్శనానికి తరలివస్తుంటారని వివరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 3, 2025

ఈ విషయం మీకు తెలుసా?

image

చెప్పులు, బూట్లు కొనేటప్పుడు చాలా మంది పొడవు నంబర్‌ను మాత్రమే చూస్తారు. అయితే షూలకు పొడవుతో పాటు వెడల్పును సూచించే ప్రత్యేక నంబర్లు (ఉదాహరణకు, B,AA, EE) కూడా ఉంటాయి. ఇది తెలియక కొందరు కొత్తవి ఇరుకుగానే ఉంటాయని భావించి మౌనంగా నొప్పిని భరిస్తుంటారు. దీనివల్ల పాదాలు, అరికాళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇకనుంచి షూ కొనే సమయంలో Width, Length చూడాలంటున్నారు. దీనికోసం పైనున్న ఫొటో చూడండి.

News December 3, 2025

మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

image

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.

News December 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>