News January 6, 2025

GNT: కుష్టు వ్యాధి అవగాహణ పోస్టర్ల ఆవిష్కరణ

image

సమష్టి కృషితో కుష్టు వ్యాధి రహిత సమాజస్థాపన కోసం కృషిచేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. “లేప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్”పై గుంటూరు జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. 

Similar News

News November 1, 2025

ANU: యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీటెక్, బీఈడి, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ, ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా అందజేయాలని సూచించారు. రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ.1860 చొప్పున, జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, జిరాక్స్ కాపీలకు రూ.2190 చొప్పున చెల్లించాలన్నారు.

News November 1, 2025

గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.

News November 1, 2025

వాట్సాప్ గ్రూపుల్లో సమాచారంపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతున్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. సామాజిక మాధ్యమాలను సరైన మార్గంలో వినియోగించడమే నోటీసుల ఉద్దేశమని తెలిపారు. గ్రూప్ అడ్మిన్లు సభ్యుల వివరాలు, సమాచారంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ధృవీకరించిన సమాచారాన్నే పంచాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు