News January 6, 2025
GNT: కుష్టు వ్యాధి అవగాహణ పోస్టర్ల ఆవిష్కరణ
సమష్టి కృషితో కుష్టు వ్యాధి రహిత సమాజస్థాపన కోసం కృషిచేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. “లేప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్”పై గుంటూరు జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
Similar News
News January 16, 2025
గుంటూరు: పీఎం ఇంటర్న్షిప్ పోస్టర్ల ఆవిష్కరణ
యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం ప్రారంభించిందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఈ పథకం సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావుతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులన్నారు. https://mca.gov.in/login/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 16, 2025
గుంటూరు: పలు పోస్టులకు నోటిఫికేషన్
గుంటూరు DCCBలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి వివరాలను అధికార సైట్లో ఉంచారు. గుంటూరు DCCBలో 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఈనెల 22లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించే అవకాశముంది.
News January 16, 2025
గుంటూరు: అత్తగారింట్లో 200 రకాల పిండి వంటలతో విందు
గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్కు మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు. దీంతో వారు బుధవారం మెుగల్తూరులో కొత్త అల్లుడు వైష్ణవ్కు 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.