News February 13, 2026

GNT: క్వారీ తిరునాళ్లపై ఎస్పీ వకుల్ జిందాల్ నిఘా

image

వడ్లమూడి క్వారీ తిరునాళ్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ప్రభల ప్రదేశాలు, పొంగళ్ల స్థలాలను సందర్శించి అధికారులకు కీలక సూచనలు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని, భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.

Similar News

News March 7, 2026

గుంటూరు: రేపు గురుకులాల్లో ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష

image

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు 6, 7 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

News March 7, 2026

గుంటూరు: మిర్చి యార్డుకు సరకు రాకల్లో హెచ్చుతగ్గులు

image

గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే టిక్కీల సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు రోజులు లక్షా 25 వేల వరకు టిక్కీలు వచ్చినా శుక్రవారం సుమారు 88 వేలకే పరిమితమయ్యాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈ తగ్గుదలకు స్పష్టమైన కారణం లేదు. హోలీ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు మాత్రమే లావాదేవీలు జరిగాయి. సోమవారం 1,04,740 టిక్కీలు రాగా తరువాత రోజుల్లో సంఖ్య పెరిగింది. ప్రస్తుతం యార్డులో 26 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి.

News March 7, 2026

జనాభా పెంపునకు గుంటూరులో పైలెట్ ప్రాజెక్ట్..?

image

రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త జనాభా నిర్వహణ విధానాన్ని సిద్ధం చేస్తోంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లాను ఎంపిక చేసే అవకాశముంది. కుటుంబాలకు ప్రోత్సాహక ప్యాకేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సకు సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తోంది. జననాల రేటు పెంచేందుకు మాతృత్వ సేవలు, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.