News February 12, 2026

GNT: చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

image

సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. పాదయాత్ర అనుభవాలను సీఎం అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ఆయన సీఎంకి అందించారు. .

Similar News

News March 6, 2026

తెనాలిలో ఉగాది పురస్కారాల సంబరాలు..!

image

పరాభవనామ తెలుగు సంవత్సరo ఉగాది పురస్కారాల సంబరాలను మా-ఎపి భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రధానోత్సవం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆహ్వానించబోతున్నట్లు వివరించారు. తేదీ,వేదిక త్వరలో ప్రకటిస్తామన్నారు.

News March 6, 2026

అమరావతిలో ‘నైలిట్’ కేంద్రం ఏర్పాటు

image

అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నైలిట్) కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. నైలిట్ ప్రతినిధులు డా.జయరాజ్, డా.లక్ష్మణ్ కొర్రా ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముందుగా తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో డిజిటల్ నైపుణ్యాలు, మెరుగైన శిక్షణ అందుబాటులోకి రానున్నాయి

News March 6, 2026

GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

image

ప్రజలు రైల్వే క్రాసింగ్‌లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.