News February 25, 2026

GNT: పత్తి రైతులకు ఊరట..!

image

2025-26 పత్తి సీజన్‌లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రైతులకు మంచి లాభం చేకూరింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ ఆధ్వర్యంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరగడంతో మధ్యవర్తుల ప్రభావం తగ్గింది. మొత్తం 9,862 మంది రైతుల నుంచి 6,66,439 క్వింటాళ్ల పత్తి సేకరించి రూ.518 కోట్లకు పైగా నేరుగా ఖాతాల్లో జమ చేశారు. గుంటూరులో 14 కేంద్రాల ద్వారా వేలాది క్వింటాళ్లు కొనుగోలు చేయగా పల్నాడులోనూ రికార్డు స్థాయిలో సేకరణ జరిగింది.

Similar News

News April 16, 2026

ఏలూరులో ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక

image

ఏలూరు స్థానిక కస్తూరిబా బాలికల పాఠశాలలో గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు గవ్వా శ్రీనివాసరావు, కె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు తదితర ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

News April 16, 2026

KNR: కో-ఆప్షన్ సభ్యుల పదవులకు భారీగా దరఖాస్తులు

image

కరీంనగర్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి ఈనెల 10 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 46 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఐదు కోఆప్షన్ సభ్యులకు భారీగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తులు రావడంతో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

News April 16, 2026

వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

image

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.