News March 20, 2025

GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

image

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.

Similar News

News December 15, 2025

బాపట్ల కలెక్టరేట్‌కు 173 అర్జీలు

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు 173 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా అర్జీలను సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నమోదైన ప్రతి అర్జీని పోర్టల్‌లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

News December 15, 2025

NZB: ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడతలో 12 మండలాల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం
సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలో గల గ్రామాలలో బుధవారం పోలింగ్ జరుగనుంది

News December 15, 2025

కామారెడ్డి: ముగిసిన మూడో విడత ప్రచారం

image

కామారెడ్డి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. జిల్లాలోని 8 మండలాల్లో ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. గత వారం రోజులుగా ఈ గ్రామాలలో మైకులు, ప్రచార వాహనాలు సందడి చేశాయి. సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ ప్రచారాలు, మైకులు మూగబోతాయి. అలాగే, పోలింగ్ ముగిసే వరకు వైన్స్లు, కళ్ళు దుకాణాలు కూడా మూతపడనున్నాయి.