News April 10, 2025

GNT: సోషల్ మీడియా దుర్వినియోగానికి గట్టి హెచ్చరిక 

image

చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను TDP ఆయనను తక్షణమే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా పార్టీ నైతిక ప్రమాణాలను ప్రదర్శించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఆచరణా నియమాలను ఉల్లంఘించే వారికి హెచ్చరికగా నిలిచింది. పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. CM చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని పలువురు అంటున్నారు. 

Similar News

News April 20, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

image

గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ వర్క్షాప్‌లో కలెక్టర్ నాగలక్ష్మి భూ సమస్యలపై కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి ఎక్కువగా భూ రికార్డుల, వెబ్‌ల్యాండ్ లోపాల, రీసర్వే అంశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధికారులు త్వరగా గుర్తించి పరిష్కరించకపోతే ప్రజలు విసుగుతో అధికార కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అధికారుల సమన్వయం వల్లే సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయన్నారు.

News April 20, 2025

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం : DEO

image

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.

News April 20, 2025

పథకాల అమలులో కూటమి విఫలం: వైవీ సుబ్బారెడ్డి

image

ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎంపీ వై.వి సుబ్బారెడ్డి ఆరోపించారు. గుంటూరు నగర పర్యటనలో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని హామీలకు అనుగుణంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ శ్రేణులను భయపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఫైర్ అయ్యారు.

error: Content is protected !!