News December 20, 2024

GNT: హత్యకేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్ 

image

పాతగుంటూరు బాలాజీనగర్‌లో మద్యం మత్తులో స్నేహితులు దాడి చేయడంతో మరణించిన తెనాలి యువకుడు దీపక్ కేసును పాతగుంటూరు పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. మృతిచెందిన దీపక్ తన స్నేహితుడు కిరణ్ కుమార్‌కు తెలియకుండా ఫోన్ పే నుంచి రూ.53వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడన్నారు. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో మద్యం తాగించి దాడి చేయడంతో దీపక్ మృతిచెందాడని సీఐ సోమయ్య తెలిపారు. 

Similar News

News January 22, 2025

ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన గుంటూరు ఎస్పీ

image

పోలీస్ సర్వీస్ నియమాలకు విరుద్ధంగా నగదు అప్పు తీసుకుని చెల్లించని ఘటనల్లో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సతీశ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఉన్నారు. వీరు ముగ్గురు ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీస్ నియమాలు-1964 లోని మూడవ నిబంధన ఉల్లంఘించారని, ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు ఎస్సీ తెలిపారు.

News January 22, 2025

మాచవరం: ఆమెపై లైంగిక దాడికి మరో మహిళ సహాయం

image

మాచవరంలో మహిళపై లైంగిక దాడికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ మంగళవారం తెలిపారు. ఎస్సై కథనం.. మాచవరానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో స్నేహం ఉండేది. ఇటీవల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం కుదిరింది. ఈ క్రమంలో స్నేహితునితో కలిసి దిగిన ఫొటోలను ఇవ్వాలంటూ అడిగింది. ఫొటోలు ఇస్తానని తెలంగాణకు తీసుకొచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అతనికి సహకరించిన మరో మహిళపై కేసు నమోదైంది.

News January 22, 2025

అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

image

తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాల్లోని నివాసాలను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధిత శాఖలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, రైల్వే, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో 16,025 నివాసాలు గుర్తించామన్నారు.