News October 29, 2025
GNT: అత్యాచారయత్నంపై బాధితురాలి ఫిర్యాదు

కూతురిపై అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించిన మారుతండ్రిపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు (D) రాజుపాలెం (మం) బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ పెళ్లై భర్తతో విభేదాల కారణంగా దూరమైంది. ప్రస్తుతం గుంటూరు పొట్టిశ్రీరాములునగర్లో మరో వ్యక్తితో ఉంటుంది. అయితే ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో కూతురిపై మారుతండ్రి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Similar News
News October 29, 2025
KNR కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తుఫాన్ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247కు కాల్ చేయాలన్నారు. భారీ వర్షాలు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News October 29, 2025
అనకాపల్లి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలు పడే అవకాశమున్నందున అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ బుధవారం తెలిపారు. విద్యార్థులు అనవసరంగా ఇల్లు దాటి బయటకురావద్దన్నారు. అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఏ పాఠశాలైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు. పాఠశాలల పరిశుభ్రత, క్లోరినేషన్స్ దృష్టిసారించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 29, 2025
HNK: నవంబర్ 14 నుంచి క్రీడా పాఠశాల ప్రారంభం

HNK జేఎన్ స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన క్రీడా పాఠశాలను నవంబర్ 14, 2025 నాటికి ప్రారంభించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ఈ స్టేడియంలోనే పాఠశాల కొనసాగనుంది. 2025-26 విద్యాసంవత్సరానికి 4వ తరగతి బాలురు 40 మంది, బాలికలు 40 మందిని కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు. వివిధ క్రీడల కోచ్లను నియమించి వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.


