News April 4, 2025
GNT: అభిరామ్కు సీఎం చంద్రబాబు అభినందన

సీఎం చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండు సీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు.
Similar News
News December 19, 2025
GNT: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఆర్మ్డ్రిజర్వ్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందికి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అనేది ప్రేమ, శాంతి, కరుణ, మానవత్వానికి ప్రతీక అని ఎస్పీ పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన సేవాభావాన్ని పోలీస్ సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
News December 19, 2025
అమరావతి పెట్టుబడులపై మలేషియా బృందంతో చర్చలు

రాజధాని అమరావతిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ శుక్రవారం మలేషియా బృందంతో సమావేశమయ్యారు. రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణ పురోగతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలను వివరించారు. 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు.
News December 19, 2025
గుంటూరు జిల్లా విద్యాశాఖలో క్రమశిక్షణ చర్యలు

గుంటూరు జిల్లాలో హెచ్ఎం/స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా అప్పటి డీఈఓగా పనిచేసిన గంగాభవానితో పాటు మరో ఏడుగురు అధికారులపై విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1991లోని రూల్ నంబర్ 20 ప్రకారం విచారణ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.


