News December 31, 2025
GNT: ‘ఆంధ్రా ఆర్నాల్డ్’ పిల్లలమర్రి వేంకట హనుమంతరావు

ప్రముఖ రచయిత, విమర్శకులు పిల్లలమర్రి వేంకట హనుమంతరావు గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1918లో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేసి, గుంటూరు హిందూ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. కవిగా, విమర్శకుడిగా రాణించి ‘ఆంధ్రా ఆర్నాల్డ్’, ‘సాహిత్యాచార్య’ వంటి బిరుదులు సొంతం చేసుకున్నారు. ‘సాహిత్య సంపద’, ‘మధుకణములు’ వంటి ఎన్నో రచనలు చేశారు. వీరి భార్య సుశీల కూడా రచయిత్రి కావడం విశేషం.
Similar News
News January 2, 2026
NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.
News January 2, 2026
రూ.7వేల కోట్లతో హైదరాబాద్కు గోదావరి జలాలు: సీఎం రేవంత్

TG: ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ జలాలను (15 టీఎంసీలు) హైదరాబాద్కు తరలిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధిని ఎన్నికల అజెండాగా పెట్టుకున్న బీజేపీ.. ఇక్కడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.
News January 2, 2026
ఆదిలాబాద్: వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం: ఎస్పీ

వీడీసీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీలపై కేసులు తప్పవన్నారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.


