News December 24, 2025
GNT: ఆర్టీసీలో ఇక ‘ఎలక్ట్రిక్’ పరుగు.. పల్లెవెలుగు కూడా ఏసీనే.!

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. పల్లెవెలుగు సహా అన్నీ ఏసీ బస్సులే కావడం విశేషం. గోదావరి పుష్కరాల నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయి. దశలవారీగా 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీలను తేనున్నారు. 2030 నాటికి పూర్తిగా కాలుష్య రహిత బస్సులే లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎం ఈ-బస్ సేవ కింద మరో 750 బస్సులు రానున్నాయి.
Similar News
News December 27, 2025
డిసెంబర్ 27: చరిత్రలో ఈరోజు

☛ 1822: రేబిస్ టీకా సృష్టికర్త లూయీ పాశ్చర్ జననం
☛ 1911: కలకత్తా కాంగ్రెస్ సభలో తొలిసారిగా జనగణమన ఆలాపన
☛ 1939: టర్కీలో భూకంపం, 32 వేలమంది మృతి
☛ 1945: అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థాపన
☛ 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(ఫొటోలో) జననం
☛ 2007: పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య
☛ 2009: నటుడు నర్రా వెంకటేశ్వరరావు కన్నుమూత
News December 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 27, 2025
పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి: పార్వతీపురం కలెక్టర్

విద్యార్థులను కేవలం ఉత్తీర్ణులుగా చేయడం మాత్రమే కాకుండా, వారిని సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హితవుపలికారు. శుక్రవారం కలెక్టరేట్లో మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులు అనుసరించాల్సిన కీలక మార్పులపై పలు సూచనలు చేశారు.


