News December 13, 2025
GNT: ఇం’గలీస్’ టీచర్.. 8వ తరగతి విద్యార్థినిని ట్రాప్ చేసి..

పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పెడదారి పట్టాడు. 45 ఏళ్ళ వయస్సులో ప్రేమ పేరుతో 8వ తరగతి విద్యార్థినిని లోబర్చుకున్నాడు. గుజ్జనగుండ్లకు చెందిన కార్తీక్ పేరేచర్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఘటన తర్వాత బాలిక మేడికొండూరు PSకి వెళ్ళి సార్ తనను పెళ్ళి చేసుకున్నారని.. ఆయతోనే ఉంటానని అనడంతో పంచాయితీ జరుగుతోంది.
Similar News
News December 15, 2025
హత్యాచార దోషికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

MHలో రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్షను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవి అశోక్కు 2019లోనే సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనికి శారీరక కోరికలపై కంట్రోల్ లేదని, లైంగిక వాంఛను తీర్చుకునేందుకు అన్ని పరిమితులను ఉల్లంఘించారని తీర్పునిచ్చింది. ముర్ము బాధ్యతలు స్వీకరించాక 3 సార్లు క్షమాభిక్షను తిరస్కరించారు.
News December 15, 2025
సిద్దిపేటలో బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం

సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ 5 పంచాయతీ స్థానాలు వెల్కటూర్, బూరుగుపల్లి, రాంపూర్, నాగరాజు పల్లి, బచ్చాయిపల్లిలో గెలిచింది. బీజేపీ 2 పంచాయతీ స్థానాలు చందలా పూర్, నాంచారుపల్లి గెలవగా ఇండిపెండెంట్ -6 తడకపల్లి, అల్లీపూర్, కోదండరావుపల్లి, సిద్దన్నపేట, ఖానాపూర్, రాజ్ గోపాల్ పేట్ గెలుపొందారు.
News December 15, 2025
ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.


