News August 15, 2025
GNT: ఎమ్మెల్యే కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం..!

గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ కార్యాలయం వద్ద శుక్రవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటీవల MLA ఓ మహిళతో మాట్లాడినట్లు వీడియో కాల్ను తానే క్రియేట్ చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను అనవసరంగా ఇరికించారంటూ మహిళ వాపోయింది
Similar News
News August 16, 2025
తెనాలి: అవయవదానం.. ఏడుగురికి ప్రాణదానం

తెనాలి (M) సోమసుందరపాలెంకు చెందిన సుబ్బరాజు(62) తాను మరణించి కూడా ఏడుగురికి ప్రాణాలిచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం తెల్లవారుజామున బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఓ ట్రస్ట్ ద్వారా ఆయన అవయవాలను దానం చేశారు. తహశీల్దార్ గోపాలకృష్ణ మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసి, సత్కరించారు.
News August 15, 2025
గుంటూరు జిల్లాలో ఫ్రీ బస్సు.. 302 బస్సులు కేటాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా నేడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. అయితే గుంటూరు జిల్లా పరిధిలోని 5 డిపోల్లో 302 బస్సులను స్త్రీ శక్తి పథకానికి కేటాయించినట్లు ఇన్ఛార్జ్ RM సామ్రాజ్యం చెప్పారు. ఫ్రీ బస్సు పథకానికి 302 బస్సుల్లో కేటాయించగా వాటిలో 241 పల్లె వెలుగు, 8 అల్ట్రా పల్లె వెలుగు, 53 ఎక్స్ప్రెస్ బస్సులను మహిళలకు అందుబాటులో ఉంచామని ఆమె వెల్లడించారు.
News August 15, 2025
తెనాలి: స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఆదరణ కరవు

తెనాలికి చెందిన అడిగోపుల నరసింహారావు, బాలత్రిపుర సుందరి దంపతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. స్వాతంత్ర్య సంగ్రామం అనంతరం వీరి త్యాగాలను గుర్తిస్తూ ప్రభుత్వం తామ్ర పత్రాలను ఇచ్చి గౌరవించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆదరణలేక సాయం అందక వీరి కుమారుడు ఉమామహేశ్వరరావు దారం తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తూ అద్దె ఇంట్లో భారంగా కాలం వెలదీస్తున్నారు.