News February 13, 2026
GNT: క్వారీ తిరునాళ్లపై ఎస్పీ వకుల్ జిందాల్ నిఘా

వడ్లమూడి క్వారీ తిరునాళ్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ప్రభల ప్రదేశాలు, పొంగళ్ల స్థలాలను సందర్శించి అధికారులకు కీలక సూచనలు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని, భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.
Similar News
News April 14, 2026
గుంటూరు: దరఖాస్తు గడువు పొడిగింపు

గుంటూరు జిల్లాలో 38 బ్యాక్లాగ్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వెంకటరమణప్ప సోమవారం తెలిపారు. ఇందులో టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు సీపీటీ (CPT) పాసై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాల కోసం https://guntu-rap.in/dw2026 వెబ్సైట్ను చూడవచ్చన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 14, 2026
GNT: రీ-సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు

భూముల రీ-సర్వేలో వచ్చిన లోపాలను సరిచేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం రైతులకు మ్యుటేషన్, సబ్డివిజన్కు అవకాశం కల్పించారు. జూన్ 30 వరకు రాయితీ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సాధారణంగా రూ.550 ఉండే ఫీజు, గడువులో రూ. 50కే పరిమితం చేశారు. రీ-సర్వేలో ఎల్పీఎం నంబర్లు, భూమి వివరాలు తారుమారవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
News April 14, 2026
GNR: ఈ నెల 16 నుంచి స్వీయ నమోదు ప్రారంభం

గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత జనగణన డిజిటల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ వారంలో భాగంగా 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం కల్పించారు. మొత్తం 33 ప్రశ్నలతో కుటుంబ వివరాలు నమోదు చేయాలి. పోర్టల్లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సమాచారం ఇవ్వవచ్చు. మే 1 నుంచి గణకులు ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఆధార్ వంటి పత్రాలు అవసరం లేదు. వివరాల గోప్యతకు చట్ట పరిరక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.


