News September 7, 2025

GNT: గ్రహణం రోజు దర్భలు ఎందుకు వాడతారో తెలుసా..?

image

దర్భలు ఎంతో పవిత్రమైనవి. సూర్య,చంద్ర గ్రహణాలు ఏర్పడిన సమయంలో చాలా మంది దర్భలను తమ ఇళ్లకు తీసుకు వెళుతుంటారు. ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంగా ఈ సమయంలో రాహువు చెడు దృష్టి, చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. చంద్రుని కిరణాలు, రాహువు చెడు దృష్టి పడినప్పటికీ ఎలాంటి నష్టం కలుగకుండా ఆహార పదార్థాలపై దర్బలు వేసి ఉంచుతారని పండితులు చెబుతారు.

Similar News

News September 8, 2025

మహాలయ పక్షాలు అంటే ఏంటి?

image

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.

News September 8, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

image

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం(తిరుపతి జిల్లా), శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, మహానంది నందీశ్వర ఆలయం, యాగంటి ఉమా మహేశ్వర ఆలయం(నంద్యాల), ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి(కోనసీమ), అమరేశ్వర స్వామి ఆలయం (అమరావతి), పాలకొల్లు క్షీరారామ ఆలయం, భీమవరం సోమారామ ఆలయం(ప.గో), తాడిపత్రి రామలింగేశ్వరస్వామి (అనంతపురం), కుమారారామం కుమారభీమేశ్వర స్వామి ఆలయం(కాకినాడ), భైరవకోన దేవాలయం(ప్రకాశం).

News September 8, 2025

తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు

image

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం(సిరిసిల్ల జిల్లా), కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం(సిద్దిపేట), రామప్ప రామలింగేశ్వరస్వామి గుడి(ములుగు), కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం(JS భూపాలపల్లి), రుద్రేశ్వర ఆలయం-వేయి స్తంభాల గుడి(హన్మకొండ), పానగల్ ఛాయా సోమేశ్వరాలయం(నల్గొండ), కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం(మేడ్చల్-మల్కాజిగిరి), ఐనవోలు మల్లన్న స్వామి ఆలయం(వరంగల్), జడల రామలింగేశ్వరస్వామి ఆలయం(నల్గొండ).