News December 19, 2025

GNT: ‘జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’

image

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందేలా చూస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ హామీ ఇచ్చారు. ‘సామ్నా’ జిల్లా నూతన కమిటీ సభ్యులు ఆయనను కలిసి అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News December 19, 2025

గుంటూరులో గంజాయి అక్రమ రవాణా.. ఐదుగురి అరెస్ట్

image

గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేసి, 1.20కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్రాడిపేట ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన CI ఆరోగ్యరాజు, SI క్రిష్ణ బాజీ బాబు, సిబ్బందిని వెస్ట్ DSP అరవింద్ అభినందించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.

News December 19, 2025

‘పీ4’తోనే పేదరిక నిర్మూలన: కలెక్టర్

image

పేదరిక నిర్మూలనకు P4 విధానం ఒక గొప్ప వేదికని కలెక్టర్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఆటోనగర్‌లోని ‘పీఐ డేటా సెంటర్’లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ సీఈవో కళ్యాణ్ ముప్పనేని ఆధ్వర్యంలో ఎంపికైన లబ్ధిదారులకు కుట్టు యంత్రాలు, వ్యవసాయ స్ప్రే ట్యాంకర్లు, ఎలక్ట్రికల్ కిట్‌లను పంపిణీ చేశారు. పేదల ఆర్థికాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి చేయూతనందించడం అభినందనీయమని ఆమె కొనియాడారు.

News December 19, 2025

GNT: మోసం కేసు ఛేదించిన పోలీసులకు SP ప్రశంసలు

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును సాంకేతికంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్తిపాడు, కాకుమాను పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఈ కేసులో సమర్థవంతంగా గుంటూరు పశ్చిమ డీఎస్పీ బానోదయ భానోదయ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా ప్రశంసించారు.