News February 25, 2026
GNT: జాబ్ మేళాలతో లక్ష మందికి ఉద్యోగాలు

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేశ్ శాసనసభలో తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేపడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జాబ్ మేళాల ద్వారా 1.08 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
Similar News
News February 27, 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా యాదాద్రిని తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. గురువారం ఆలేరు పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలుపై సమీక్షించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
News February 27, 2026
రైల్వేస్టేషన్లో స్పృహ కోల్పోయిన వ్యక్తి మృతదేహం ఇంకా మార్చురిలోనే

విశాఖ రైల్వేస్టేషన్లో ఈ నెల23న ప్లాట్ఫారం1 గేట్ నం.3 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వ్యక్తిని రైల్వేపోలీసులు గమనించి KGHకి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. ఆ మృతదేహం ఇంకా KGH మార్చూరిలో ఉండగా, మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.
News February 27, 2026
భారత్ ఘన విజయం

T20WC: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 72 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్య ఛేదనలో ZIM బ్యాటర్లు 184-6 రన్స్కే పరిమితమయ్యారు. బెనెట్(97*) ఒంటరి పోరాటం చేశారు. కెప్టెన్ రజా(31) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, వరుణ్, అక్షర్, దూబే తలో వికెట్ తీశారు. మార్చి 1న వెస్టిండీస్తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు చేరుతుంది.


