News October 28, 2025

GNT: తుపాను ప్రభావంతో రైళ్ల రద్దు

image

తుపాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో అనేక రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి, విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు గుంటూరు-నర్సాపూర్, గుంటూరు-రాయగడ, హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా రైళ్లు మంగళవారం రద్దయ్యాయి. బుధవారం రాయగడ-గుంటూరు, భువనేశ్వర్-హైదరాబాద్ రైళ్లు నడవవని తెలిపారు. అదనంగా బెజవాడ-తెనాలి, రేపల్లె, మార్కాపురం మార్గాల్లో పలు రైళ్లు నిలిపివేశారు.

Similar News

News October 28, 2025

HYD: మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు ప్రకాశ్ లోంగుబాటు

image

మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ నుంచి కీలక వ్యక్తి బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఆ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా గతంలో ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియాలో ఈయన కీలక ఆర్గనైజర్‌గా తెలుస్తోంది. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ @ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.

News October 28, 2025

రంపచోడవరం: ఘాట్ రోడ్డులో భారీ వాహనాలు నిలిపివేత

image

తుఫాన్ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. డి.ఎస్.పి సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద మంగళవారం మళ్లిస్తున్నామని సీఐ సన్యాసినాయుడు తెలియజేశారు. తుఫాన్ తగ్గుముఖం పట్టే వరకు భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలన్నారు.

News October 28, 2025

అరకు: నేడు, రేపు పర్యాటక ప్రదేశాలు మూసివేత

image

మొంథా తుఫాను ప్రభావంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఐటిడిఏ పరిధిలోని పర్యాటక ప్రదేశాలను నేడు, రేపు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకులోయ మండలంలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్, గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శనిలు మూతపడ్డాయి. కావున ఇప్పటికే అరకు వచ్చిన పర్యాటకులు దీనిని గమనించాలని, అరకు వద్దామనుకున్న పర్యాటకులు తుఫాను తగ్గేవరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.