News August 18, 2025
GNT: ‘పీజీఆర్ఎస్కి 33, డీవైసీకి 16 ఫిర్యాదులు’

జీఎంసీ డయల్ యువర్ కమిషనర్కి 16, పీజీఆర్ఎస్కి 33 ఫిర్యాదులు అందాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 14 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం జీఎంసీ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలను కమిషనర్ నిర్వహించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువు తేదీ లోపు పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News August 18, 2025
గుంటూరు: పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నేతలు

కాకుమాను మండలంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ బలసాని కిరణ్ కుమార్ సోమవారం పర్యటించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వారు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని వారు కోరారు.
News August 18, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 19, 20 తేదీల్లో మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మీ, SP సతీశ్ కుమార్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. 19వ తేదీన సీకే కన్వెన్షన్లో ‘జీరో పావర్టీ పీ4’ కార్యక్రమం. 20న మంగళగిరి మయూరి టెక్ పార్క్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభిస్తారు. కలెక్టర్, SP సభాస్థలం, సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
News August 18, 2025
GNT: ఫ్రీ బస్సు.. ఐడీ లేకుంటే 2 రోజులే అవకాశం!

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో 403 బస్సులు అందుబాటులో ఉండగా, 302 బస్సులు (70%) బస్సుల్లో మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు గుంటూరు ఇన్ఛార్జ్ ఆర్.సామ్రాజ్యం తెలిపారు. రెండు, మూడు రోజులు ఒరిజినల్ ఐడీ కార్డు లేకపోయినా అనుమతిస్తామని, ఆ తర్వాత తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.