News October 31, 2025
GNT: పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు పీజీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణాధికారి శివప్రసాదరావు శుక్రవారం తెలిపారు. 1,3 సెమిస్టర్ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ ఎల్.ఎల్.ఎమ్ పరీక్ష ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.
Similar News
News October 31, 2025
Asia Cup: ఒకట్రెండు రోజుల్లో భారత్కు ట్రోఫీ!

ఆసియా కప్ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో ACC చీఫ్ నఖ్వీ అందజేసే అవకాశం ఉందని BCCI ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నవంబర్ 4న ICC మీటింగ్ ఉండటంతో ఆ లోపు ఇస్తారని అంచనా వేస్తోంది. మరోవైపు నెల రోజులవుతున్నా ట్రోఫీని ఇవ్వకపోవడం సరి కాదని BCCI సెక్రటరీ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అది ముంబైలోని బీసీసీఐ ఆఫీసుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే ICC దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
News October 31, 2025
లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టవచ్చా?

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ప్రమాదకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లోకి వర్షాకాలంలో నీరు వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లోకి తేమ చేరితే అనారోగ్యం వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రాణశక్తి కూడా తక్కువే. దీనివల్ల నివాసంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్థిరమైన, సుఖమైన జీవనం కోసం ఎత్తుగా, సమతలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>
News October 31, 2025
సంగారెడ్డి: ‘ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి’

ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లస్టర్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని చెప్పారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ పాల్గొన్నారు.


