News January 10, 2026
GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.
Similar News
News February 12, 2026
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: కలెక్టర్

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల సానుకూల దృక్పథం పెరగాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజల సానుకూల దృక్పథం (పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్)పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలోఅమలు పక్కాగా ఉండాలని, అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
News February 12, 2026
అమరావతిని వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక

అమరావతిని ప్రాంతీయ సమీకృత వృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో విజయవాడ–గుంటూరు–అమరావతి ప్రాంతాన్ని లాజిస్టిక్స్, పరిపాలన, నైపుణ్యాల హబ్గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాజధానిని అనుసంధానించి టైర్-2 పట్టణ సముదాయంగా రూపుదిద్దుతామని పేర్కొన్నారు. పునర్నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు.
News February 12, 2026
అమరావతిలో మెరీనా ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం

కృష్ణా నది తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమరావతి సమీపంలో భారీ మెరీనా నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. వెంకటపాలెం వద్ద పీపీపీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో వినోదం, బోటింగ్, క్లబ్ హౌస్లు, గెస్ట్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. నదీ తీరాన్ని ఆకర్షణీయంగా మార్చి దేశీయ-విదేశీ పర్యాటకులను రప్పించాలన్నది ఉద్దేశం. టెండర్ ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.


