News August 26, 2025

GNT: మీరు కూడా అలా పసుపు రాసేవారా?

image

వినాయకచవితి అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఒకప్పుడు పిల్లలు తెల్లవారుమున లేచి తలస్నానం చేసి ఇంట్లో వినాయకుడి మండపం అలంకరించేందుకు నాన్నకు సహాయం చేస్తాం. పుస్తకాలకు పసుపుతో ఓం రాసి మంచి మార్కులు రావాలని కోరుకునేవాళ్లం. మనలో కొంతమంది అయితే క్రికెట్ బ్యాట్లు, వీడియో గేమ్లు, బొమ్మలు, సైకిళ్లు, నాన్న వాడే పనిముట్లపై కూడా పసుపు రాసేవాళ్లం. మీకు కూడా ఆ రోజులు గుర్తొస్తున్నాయా అయితే COMMENT చేయండి.

Similar News

News August 26, 2025

తాడేపల్లి: ‘ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు’

image

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా MEPMA మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఐఏఎస్ మూడు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో పర్యావరణంలో కలిసిపోయే బాటిల్స్, కంపోస్టబుల్ ఎరువులు తయారికి అవసరమయ్యే కర్మాగారాలను నెలకొల్పడంలో ఈ సంస్థలు సహకారం అందిస్తుందన్నారు.

News August 26, 2025

అమరావతి పనుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్

image

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి CRDA తన కొత్త రాయపూడి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇది 360° పర్యవేక్షణ, రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, పచ్చదనం ట్రాక్ చేయడం వంటి నెలవారీ పురోగతి నివేదికలను రోజువారీగా అందించడం కోసం CCTV కెమెరాలు, డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు పనుల పురోగతి తెలుసుకునేందుకు మరింత వీలుకానుంది.

News August 26, 2025

GNT: పండగలకు మరుగైన మామిడి తోరణాలు

image

పండగ వచ్చిందంటే చాలు, ఇంటిల్లిపాది పచ్చని మామిడి తోరణాలతో ఇళ్లను అలంకరించేవారు. ఆ పచ్చని తోరణాలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచేవి. ఒకప్పుడు ఇరుగుపొరుగు ఇళ్లలో మామిడి ఆకులను పంచుకునేవారు. కానీ ఇప్పుడు తోరణాలను కూడా మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగల హడావుడిలో తోరణాలు కట్టడం, వాటిని పంచుకోవడం వంటి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. మీ బాల్యంలో తోరణాల కోసం ఏం చేశారో కామెంట్