News March 16, 2025
GNT: మేయర్ ఆకస్మిక నిర్ణయంపై వైసీపీలో అసంతృప్తి

మేయర్ మనోహర్ రాజీనామా నిర్ణయంపై వైసీపీలో కూడా కొంత అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం. వైసీపీకి ఉన్న 23 మంది కార్పొరేటర్లతో ఆయన మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా నగర అధ్యక్షులకు కూడా సమాచారం ఇవ్వలేదని సమాచారం. టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో తదుపరి చర్యలపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
Similar News
News March 16, 2025
రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

ఇంటర్ ప్రథమ, 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. గురువారంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం, శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 29,405 మందికి 28,901 మంది హాజరు కాగా 503 మంది గైర్హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి జరగనుంది. ఇందుకోసం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళ కాలేజీలో ఏర్పాట్లు చేశారు.
News March 16, 2025
GNT: అందుకే కావటి మనోహర్ రాజీనామా.?

నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జీఎంసీలో 4ఏళ్లలోపు ఎటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. ఈ నెలతో ఆ గడువు ముగుస్తుంది. కనుక అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతామని టీడీపీ నాయకులు బాహాటంగానే ప్రకటించారు. అందుకే మేయర్ రాజీనామా అని పలువురు చర్చించుకుంటున్నారు.
News March 15, 2025
గుంటూరు ఛానల్లో గల్లంతైన బాలుడి మృతి

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్ నగర్కు చెందిన ప్రొక్లెయినర్ డ్రైవర్ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు.