News September 25, 2025

GNT: మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

image

భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ నెల 23వ తేదీ మంగళవారం సాయంత్ర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించడం జరిగిందని జల వనరుల విభాగ అధికారులు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 వరకు బ్యారేజీ నీటి మట్టం 12 అడుగుల కంటే తక్కువగా ఉన్నట్లు చెప్పారు.

Similar News

News September 27, 2025

తుళ్లూరు: 97 మందికి రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

image

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని CRDA కార్యాలయంలో ఈ- లాటరీ విధానంలో 97 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు మొత్తం 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులున్నారు.

News September 27, 2025

గుంటూరు జిల్లాలో వర్షం

image

వాయువ్య,దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, ఉందని తెలిపారు. శనివారం గుంటూరు, పల్నాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

News September 27, 2025

అతిసార వ్యాధి నియంత్రణలో ఉంది: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని కలెక్టర్ ఎం. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 177 కేసులు నమోదయ్యాయని, వాటిలో 152 కేసులు గుంటూరు పట్టణం నుంచి, 25 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని ఆమె వివరించారు. ఈ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.