News March 11, 2025
GNT : లాడ్జిలో కిడ్నాప్, హత్యాయత్నం .. కారణమిదే.!

గుంటూరులోని లాడ్జిలో వ్యక్తిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు వివాహేతర సంబంధంమే కారణమని తెలుస్తోంది. మప్పాళ్లలోని చాగంటివారిపాలెం వాసి రామలింగేశ్వరరావు అదే ప్రాంత మహిళతో సంబంధం ఉంది. సోమవారం అతను మహిళతో లాడ్జిలో ఉండగా .. గమనించిన బంధువులు ఫాలో చేసి పట్టుకుని కొట్టి తీసుకెళ్లారు. లాలాపేట పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Similar News
News March 12, 2025
గుంటూరు మిర్చి ఘాటున్నా.. రేటు లేదు !

ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డులో మిర్చి ఘాటైతే ఎక్కువగా ఉంది కానీ రేటు మాత్రం లేదు. రైతులు ఆరుగాలం శ్రమించినా సరైన గిట్టుబాటుధర లభించక ఇబ్బందులు పడుతున్నారు. గత సీజన్లో రూ.25.వేలు పలికిన క్వింటా ఈ ఏడాది రూ.11వేలకు కూడా పలకనంటొంది. కేంద్రం రూ.11,781 చెల్లిస్తామని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చెప్పినప్పటికీ రైతులు ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు. రైతులు క్వింటాకి రూ.20వేలు ఆశిస్తున్నారు.
News March 12, 2025
గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచనలు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించి మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్లో ఎటువంటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గుర్తులు ఉన్నవి వాడటానికి వీలులేదని స్పష్టం చేశారు.
News March 11, 2025
సీఆర్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

వెలగపూడిలోని అసెంబ్లీలోని ఛాంబర్లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు విషయాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పొంగూరు నారాయణ, కేశవ్ పయ్యావుల, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.