News October 22, 2025
GNT: 40 ఏళ్ల పాటు ఓ పత్రికను నడిపారంటే మాటలా.!

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కోలవెన్ను రామకోటేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1894 అక్టోబర్ 22న జన్మించారు. న్యాయశాస్త్ర పట్టభద్రులైన ఆయన జాతీయోద్యమం వైపు వెళ్లారు. 1928లో బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయుడిగా, తరువాత ప్రిన్సిపల్గా పనిచేశారు. బందరు నుంచి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు 4 దశాబ్దాలు నిర్వహించారు. 1940లో పలు ఉద్యమాలలో పాల్గొని జైలుకు సైతం వెళ్లారు.
Similar News
News October 22, 2025
కేటీఆర్, హరీశ్రావుతో కేసీఆర్ సమీక్ష

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్ఎస్ ఇన్ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.
News October 22, 2025
542 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వెహికల్ మెకానిక్, MSW(పెయింటర్, DES)పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగలవారు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. PET, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bro.gov.in/
News October 22, 2025
కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.