News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్లో అప్పగించినట్లు తెలుస్తోంది.
Similar News
News March 22, 2025
బ్రాడీపేటలో త్వరలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు: సజీల

గుంటూరు నగరంలో త్వరలో మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవితో కలిసి బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడిపేట 4వ లైన్ 14 వ అడ్డరోడ్డులో ఫుడ్ కోర్ట్ ఉగాది లేదా శ్రీరామ నవమి నాటికిప్రారంభిస్తామన్నారు
News March 21, 2025
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో 26 జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, MGNREGS ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, పల్లె పండుగలో భాగంగా మొదలుపెట్టిన అభివృద్ధి పనుల స్థితిగతులపై, రేపు మొదలు పెట్టబోయే ఫాం పాండ్స్ పనులపై ఆరా తీశారు. ఈ కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ పాల్గొన్నారు.
News March 21, 2025
మంగళగిరి: సీసీటీవీల పురోగతిపై హోంమంత్రి సమీక్ష

మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీశ్ గుప్తాతో పాటు జిల్లాల ఎస్సీలతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతి, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసుల్లో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు ఇచ్చారు.