News March 4, 2025
GNT: ‘వాలంటీర్’ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 4, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సాగిందిలా..

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొదటి నుండి 9వ రౌండ్ వరకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి రౌండ్-17,194, 2వ-15,627, 3వ-16,722, 4వ-16,236, 5వ-16,916 6వ-17,028, 7వ-16,447 8వ-16,900 9వ రౌండ్-10,087 చొప్పున మొత్తం 1,45,057ఓట్లు వచ్చాయి. అలాగే లక్ష్మణరావుకు మొదటి రౌండ్-7,214, 2వ-6,742, 3వ-7,404, 4వ-7,828, 5వ-7,535, 6వ-6,844, 7వ-7,251, 8వ-7,201, 9వ రౌండ్-4,718 చొప్పున మొత్తం 62,737 ఓట్లు వచ్చాయి
News March 4, 2025
గుంటూరు: తొలి రౌండ్ నుంచే ఆధిక్యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొదటి రౌండ్ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన ఆధిక్యతను చాటుకున్నారు. అందరూ ఆలపాటికి, లక్ష్మణరావుకు మధ్య ఓట్ల వ్యత్యాసం పోటాపోటీగా ఉంటుందని భావించారు. అయితే వీటిని పటాపంచలు చేస్తూ ఆలపాటి ప్రతి రౌండ్లోనూ మెజారిటీ పెంచుకుంటూ వెళ్లారు. మొదటి రౌండ్లో 17,194 ఓట్లతో మొదలై.. చివరి 9వ రౌండ్ ముగిసేసరికి 1,45,057 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని పొందారు.
News March 4, 2025
GNT: అప్పుడు వెనక్కి తగ్గారు.. ఇప్పుడు విజయం సాధించారు

గత అసెంబ్లీ ఎన్నికలలో తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలపాటి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ఆలపాటి MLC ఎన్నికలను సవాల్గా తీసుకొని పట్టభద్రుల మద్దతుతో అఖండ విజయం సాధించారు.