News March 19, 2025
తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
Similar News
News December 3, 2025
వదల ‘బొమ్మా’ళి.. మళ్లీ కస్టడీ పిటిషన్

TG: ఐబొమ్మ రవి కేసులో మరో 4 కేసుల్లో కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని రవి న్యాయవాదిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఒకే కేసులో రవిని పోలీసులు రెండుసార్లు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అటు కస్టడీ పూర్తి కావడంతో రవి బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
News December 3, 2025
‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.
News December 3, 2025
‘కాటన్ ష్రెడర్’తో మరిన్ని ప్రయోజనాలు

కాటన్ ష్రెడర్తో తక్కువ ఇంధనంతోనే మొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేయవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల నేలసారం పెరగడంతో పాటు నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం భూమికి పెరుగుతుంది. మట్టి సేద్యానికి అనువుగా, వదులుగా మారుతుంది. నేల కోతను తగ్గించవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల గులాబీ పురుగు ఉద్ధృతిని చాలా వరకు తగ్గుతుంది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధి చెందుతుంది.


