News March 19, 2025

తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

image

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

Similar News

News November 24, 2025

ఎన్నికలకు సిద్ధం.. కోర్టుకు తెలపనున్న Govt, SEC

image

TG: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు ఇవాళ HCలో విచారణకు రానుంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్లు ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 50% రిజర్వేషన్లు మించకుండా GOలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పనుంది. అటు పూర్తి ఏర్పాట్లు చేశామని, అధికారులు, సిబ్బంది సమాయత్తంపై ఎన్నికల సంఘం వివరించనుంది. నిన్నటి నుంచి గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లపై మండల ఆఫీసుల్లో లిస్టులను అధికారులు ప్రదర్శనకు ఉంచారు.

News November 24, 2025

రైజింగ్ స్టార్స్ కప్ గెలిచిన పాక్.. INDపై ట్రోల్స్!

image

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ విజేతగా PAK A నిలిచింది. ACC ఛైర్మన్ నఖ్వీ ఆ జట్టుకు ట్రోఫీ అందించగా, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తూ PAK ఫ్యాన్స్ టీమ్ ఇండియాను ట్రోల్ చేస్తున్నారు. ‘పక్క దేశం వాళ్లకు ఇది ఇంకా నెరవేరని కలే’ అంటూ పోస్టులు పెడుతున్నారు. వాటికి IND ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. కాగా SEPలో ఆసియా కప్ గెలిచిన అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు IND నిరాకరించిన సంగతి తెలిసిందే.

News November 24, 2025

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలపై అప్‌డేట్

image

APలో పంచాయతీ పాలక వర్గాలకు 2026 MAR వరకు గడువుండగా, MPTC, ZPTCల పదవీకాలం SEPతో ముగియనుంది. FEB, MARలో SSC, ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగొచ్చు. పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం SEP/OCTలో జరగొచ్చని అంచనా. కాగా రిజర్వేషన్ల ఖరారు కోసం వచ్చే నెలలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌‌ను ఏర్పాటు చేయనుంది. అధ్యయనం, అభిప్రాయ సేకరణ అనంతరం కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారవుతాయి.