News January 8, 2025
విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవు: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ‘ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండటం దేశానికి కలిసొస్తోంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్’ అని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
మూవీ ముచ్చట్లు

✦ ఈ నెల 12నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’
News December 8, 2025
INDIGO… NAIDU MUST GO: అంబటి

AP: ఇండిగో సంక్షోభాన్ని ముందుగా కనిపెట్టడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని YCP నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘INDIGO… NAIDU MUST GO!’ అంటూ రామ్మోహన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రామ్మోహన్ తెలుగువారి పరువు తీశారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 5వేల విమాన సర్వీసులు రద్దవ్వగా 8లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
News December 8, 2025
‘నీ భార్యను ఇండియాకు పంపేయ్’.. JD వాన్స్పై నెటిజన్ల ఫైర్

వలసలపై US ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సామూహిక వలసలు అమెరికా కలను దొంగతనం చేయడమేనని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది విదేశీయులపై ద్వేషమేనని నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘మీ భార్య ఉష, ఆమె ఫ్యామిలీ, మీ పిల్లలను ఇండియాకు పంపేయండి’ అని మండిపడుతున్నారు. హిందువైన తన భార్య <<18155411>>క్రైస్తవం<<>>లోకి మారే ఛాన్స్ ఉందని ఇటీవల వాన్స్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి.


