News January 8, 2025
విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవు: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ‘ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండటం దేశానికి కలిసొస్తోంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్’ అని పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
పార్టీలో ఏది పడితే అది తినకండి!

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ హడావుడి మొదలైంది. ఏం తాగాలి.. ఏం తినాలో లిస్ట్ రాసేసుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘చిప్స్, పకోడీ, డీప్ ఫ్రై చేసిన చికెన్ వంటి వాటితో గ్యాస్, అసిడిటీ వస్తుంది. అందుకే నాన్వెజ్ కూడా మితంగా తినాలి. మటన్, చికెన్ వంటివి నైట్ డైజెస్ట్ అవ్వవు. స్వీట్స్, కేకులు కూడా లిమిట్గానే తినాలి’ అని సూచిస్తున్నారు.
News December 31, 2025
న్యూఇయర్ వేళ మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో న్యూఇయర్ వేళ బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18719998>>మళ్లీ<<>> తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.980 తగ్గి రూ.1,35,220కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.900 పతనమై రూ.1,23,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 31, 2025
ఒక్కరితో ఆపొద్దు.. ఇద్దరు ముగ్గురికి జన్మనివ్వండి: అస్సాం CM

హిందూ జంటలు ఒక్క సంతానంతో ఆపొద్దని, ఇద్దరిని కనాలని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ కోరారు. అవకాశం ఉన్నవాళ్లు ముగ్గురికి జన్మనివ్వాలన్నారు. రాష్ట్రంలో హిందువుల బర్త్ రేట్ తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉందన్నారు. 7-8 మంది పిల్లల్ని కనొద్దని ముస్లింలను కోరారు. AP CM CBN కూడా ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని కోరుతున్న విషయం తెలిసిందే.


