News March 8, 2025

25న గోదావరి బోర్డు భేటీ.. ‘బనకచర్ల’పై చర్చ

image

ఈ నెల 25న తెలుగు రాష్ట్రాల అధికారులతో గోదావరి బోర్డు సమావేశం జరగనుంది. గోదావరి పరీవాహకంలోని 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని AP, TGలను బోర్డు కోరనుంది. అలాగే వివాదాస్పదమైన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఏపీకి చెందిన 4, తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టుల అనుమతులపైనా వివరాలు సేకరించనుంది.

Similar News

News November 6, 2025

ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

image

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.

News November 6, 2025

వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

image

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>

News November 6, 2025

’FATHI’ ఆరోపణలు అవాస్తవం: ఐఏఎస్‌లు

image

TG: విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి దేవసేనపై ప్రయివేటు కాలేజీల సంఘం(FATHI) <<18207242>>ఆరోపణలు<<>> నిరాధారం, అవాస్తవమని IASల అసోసియేషన్ ఖండించింది. ఫతి ఆరోపణలు ఆమెను తక్కువ చేసేవే కాకుండా సివిల్ సర్వీసెస్ నైతికతను సమగ్రతను దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొంది. ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. విధుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటూ అంకిత భావంతో పనిచేసే అధికారులపై ఆరోపణలు తగవని హితవు పలికింది.