News August 21, 2025
ఉద్ధృతంగా గోదావరి.. ఉ.11గంటలలోపు మొదటి ప్రమాద హెచ్చరిక!

గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద 50.3 అడుగుల నీటిమట్టం ఉండగా, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా ఉందని APSDMA వెల్లడించింది. ఉదయం 11గంటల లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఆస్కారముందని తెలిపింది. అటు, ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 5.04 లక్షల క్యూసెక్కులుగా ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు చెప్పింది.
Similar News
News August 21, 2025
రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

‘కౌన్ బనేగా కరోడ్పతి- 17’లో ఉత్తరాఖండ్కు చెందిన IPS ఆదిత్య కుమార్ రూ.కోటి గెలుచుకుని సత్తాచాటారు. ఈ సీజన్లో ఈయనే తొలి కరోడ్పతి కావడం విశేషం. ఈ సందర్భంగా నెట్టింట ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. రూ.కోటి ప్రశ్న ఇదే.. ‘మొదటి అణు బాంబు తయారీకి ఉపయోగించిన ప్లూటోనియం అనే మూలకాన్ని వేరుచేసిన శాస్త్రవేత్త పేరు మీద ఉన్న మూలకం ఏది? A. సీబోర్జియం, B. ఐన్స్టీనియం, C. మైట్నేరియం, D. బోహ్రియం. ANS ఏంటి?
News August 21, 2025
లోక్సభ నిరవధిక వాయిదా

లోక్సభ నిరవధిక వాయిదా పడింది. 21 రోజుల పాటు సభ జరిగింది. సమావేశాల సందర్భంగా నిన్న ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం లభించింది.
News August 21, 2025
లిక్కర్ స్కాం: రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి

AP: మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆస్తులు జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సీఐడీ అభియోగం మోపింది.